
ప్రధాని మోడీ వేసిన ప్లాన్ ఇప్పుడు నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.. కొత్తగా విడుదల చేసిన 2000, ఇతర 1000,500 నోట్లల్లో అతిచిన్న నానో చిప్ పెట్టారని విశ్వసనీయ సమాచారం. ఇది ఉపగ్రహాల సాయంతో డబ్బు ఎక్కువ మొత్తంలో ఎక్కడుందో తెలిసిపోతుందట.. దీంతో డబ్బును దాచిపెట్టడం.. నల్లధనాన్ని గుర్తించడం సులభమట.. అందుకే ఇప్పుడు మోడీ వేసిన కొత్త నోట్ల పాచిక దేశంలో డబ్బును అడ్డగోలుగా దాచేస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది..
అసలే నల్ల ధనం సమస్యతో సతమత మవుతుంటే మళ్లీ ఈ రెండు వేల రూపాయల నోట్ ఎందుకట అని చాలామంది విమర్శిస్తున్నారు. వున్న పెద్ద నోట్లను రద్దుచేసి నల్ల ధనము అరికట్టమంటుంటే,రిజర్వ్ బాంక్ తాజాగా ఈ క్రొత్త నోట్ విడుదల చేయటములోఆంతర్యము ఏమై ఉంటుందనే వాళ్లకు మోడీ దగ్గర సమాధానం ఉంది..
ముళ్లును ముళ్లుతో తీయటం అనే సామెత దాగి వుంది.అదెలా అంటే,క్రొత్తగా విడుదల చేసే ఈ నోట్ లో NGC (nano technology chip)ని అమర్చటము జరిగినది. దీని వలన ఉపగ్రహము నుంచి వచ్చే సిగ్నల్స్ ఈ కరెన్సీ నోట్ గ్రహించి, ఆ నోట్ యెుక్క ప్రదేశాన్ని తెలుపుతుంది.దీనికి ఏవిధమైన పవర్/లేదా పరికరం అవసరం లేదు.ఉపగ్రహము నుంచి సిగ్నల్ అందగానే,మరల ఈ నోట్ తిరిగి సిగ్నల్ పంపిస్తుంది.ఈవిధముగా ఈ నోట్లు ఎక్కడ,ఎన్ని, ఎంత లోతులో ఉన్నాయనేది ఉపగ్రహము పసిగట్తి ఆ సమాచారాన్ని ఇన్ కం టాక్స్ ఆధికారులకు చేరవేస్తుంది.ఇక పెద్ద మొత్తములో సోమ్ము గుట్తుగా దాచుకొనేందుకు వీలుపడదు. ఒక వేళ ఈ నోట్ ను వేరే విధంగా మన తెలివి తేటలతో చిప్ ని డియాక్టివేట్ చేయలని ప్రయత్నిస్తే ఆ నోట్ ఎందుకు పనికి రాకుండా పోతుంది.ఈ విధముగా ఎక్కడ ఎక్కువ బ్లాక్ మనీ వుంటే అక్కడ దాడులు జరిపి బ్లాక్ మనీ ని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నమే ఈ క్రొత్త నోట్ ఉద్దేశ్యము.