
సింగరేణి నోటిఫికేషన్ జారీ చేసిన సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అక్టోబర్ 11న రాత పరీక్ష నిర్వహించేదుకు సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటనలో తెలిపింది..
దరఖాస్తులు 90వేల వరకు వచ్చాయని.. అందుకే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంతో పాటు మంచిర్యాల, హైదరాబాద్ లలో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది..