
భువనేశ్వర్ ,ప్రతినిధి : చాంపియన్స్ ట్రోఫీ హాకీ సెమీఫైనల్స్ లో భారత జట్టు పోటీ ముగిసింది. భువనేశ్వర్ కళింగ స్టేడియంలో జరిగిన రెండో సెమీఫైనల్లో…మాజీ చాంపియన్ పాకిస్థాన్ జట్టు భారత్పై 4-3 గోల్స్ తో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు ఆఖరి వరకూ పోరాడి ఓడింది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో…తొలి సెమీస్లో ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించిన జర్మనీతో పాకిస్థాన్ జట్టు పోటీపడుతుంది.