
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ రాశీ ఖన్నా , నిర్మాత దిల్ రాజులు సంధ్య థియేటర్ లో గురువారం సందడి చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందిన ‘సుప్రీమ్’. చిత్రం ఈరోజు విడుదల అయ్యింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణ లో , శిరీష్ నిర్మించిన ఈ చిత్రం విజయ యాత్రలో భాగంగా సంధ్య థియేటర్ లో ఈరోజు ప్రేక్షకులను కలుసుకున్నారు.సాయి ధరమ్ తేజ్ , రాశీ ఖన్నా, రాజేంద్ర ప్రసాద్, రవి కిషన్, సాయి కుమార్, పోసాని కృష్ణ మురళి , శ్రీనివాస్ రెడ్డి, మురళీ మోహన్ , రఘు బాబు, జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు ఈ చిత్రం లో నటించారు.