
తెలంగాణ మద్యం విధానంలో లాటరీ ద్వారానే దుకాణాలు కేటాయించనున్నట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రెండేళ్లపాటు ఈ దుకాణాలు మనుగడలో ఉంటాయి.. తెలంగాణలోని మొత్తం 2216 దుకాణాలకు 24 యూనిట్ల అబ్కారీ సూపరిటెండెంట్లు సోమవారం గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేశారు.
ఒక్కో దరఖాస్తుదారు రూ.50వేలు చెల్లించి దరఖాస్తులు చేయాలి.. ఈ మొత్తాన్ని వాపస్ ఇవ్వరు.. ఉన్నత శ్లాబు ధర రూ.5 లక్షలు.. ఒక్కో దరఖాస్తుదారుడికి ఒక్క షాపే కేటాయిస్తారు. దుకాణం దారు తమకు లక్షలు ఫీజు చెల్లించి ఆర్థిక స్థోమత ఉందని 3 అఫిడవిట్లు ఇవ్వాలి..