
హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ సీఎంను కలిసేందుకు ఏపి సీఎం అపాయింట్ మెంట్ కుదిరింది. రేపు సాయంత్రం 5 గంటలకు బాబు కెసిఆర్ ను కలవచ్చని తెలంగాణ సచివాలయం నుంచి ఏపి సచివాలయానికి సమాచారం అందింది. అంతే కాకుండా రెండు తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను కూడా ఈ సందర్భంగా బాబు ఆహ్వానించనున్నారు.