
హైదరాబాద్ మెట్రో రైలుపైన మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు మంగళవారం సమీక్ష నిర్వహించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హెచ్ యం అర్ అధికారులకు పలు అదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మెట్రో రైలుకు వస్తున్న భారీ స్పందన నేపథ్యంలో రైళ్ళ సంఖ్యను పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీంచాలన్నారు. అయితే వచ్చే ఫిబ్రవరి నాటికి ప్రయాణీకుల సంఖ్యను బట్టి ఫ్రీక్వెన్సీ ని పెంచుతామని చేస్తామని మంత్రికి హెచ్ యం అర్ అధికారులు తెలిపారు. మెట్రో ప్రయాణీకులకు అవసరం అయిన పార్కింగ్ సౌకర్యాలపైన మంత్రి ప్రత్యేకంగా చర్చించారు. అవసరం అయిన మేరకు పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటి వరకు ఉన్న పార్కింగ్ ప్రాంతాలను ప్రజలకు తెలిసేలా చర్యలు చేపట్టాలన్నారు. మెట్రో కోసం అవసరం అయిన మేరకు పోలీస్ శాఖ సహాకారం తీసుకోవాలని హెచ్ ఏం అర్ అధికారులను కోరారు. ప్రజలకు మెట్రో స్మార్ట్ కార్డుల వినియోగం, ప్రయోజనాలు ప్రజలకు మరింత తెలిసేలా అవగాహణ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. మెట్రో ఫీడర్ల రూట్లలో మరిన్ని బస్సులను ఏర్పాటు చేసేలా అర్టీసితో మాట్లాడాన్నారు.
ప్రయాణీలకుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ పైన మంత్రి ఈ సమావేశంలో చర్చించారు. మెట్రో స్టేషన్లలో తాగునీరు, మూత్రశాలల ఏర్పాటుపైన త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం పరిమితంగా ఉన్న మూత్రశాలలకు అదనంగా మరిన్ని మూత్రశాలల నిర్మాణం తక్షణం చేపట్టాలన్నారు. దీంతోపాటు జూన్ 1 డెడ్ లైన్ పెట్టుకుని ఐటి కారిడార్లో మెట్రో పనులు పూర్తి చేయాలని అధికారులకు అదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఏక్కువ మందికి ఉపయోగపడే అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ రూట్పైన ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. మెట్రో కారిడార్లలో చేపట్టిన పుట్ పాత్ల అభివృద్ది పనులను మంత్రి సమీక్షించారు.
హైదరాబాద్ నగర ప్రజలు మెట్రో రైలును అహ్వనించిన తీరు, వారు మెట్రో రైలు వినియోగంలో ప్రదర్శిస్తున్న క్రమశిక్షణ పట్ల మంత్రి కృతజ్ఘతలు తెలిపారు.