మహారాష్ట్రకు చెందిన భీజేపీ ఎంపీ పూనం మాధవ్ మురికివాడల్లో పర్యటిస్తుండగా.. జారిపోయి మురికికాలువల్లో పడిపోయారు. ఆమె ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ముంబైలోని జాలారం మురికివాడలో అక్రమ కట్టడాల కూల్చివేతకు సిద్ధమవుతుండగా ఎంపీ పూనం అక్కడి ప్రజలతో మాట్లేడేందుకు వెళ్లారు..
మురికి కాల్వపై ఉన్న కాంక్రీట్ దిబ్బపై నిలుచుండి బాదితులతో మాట్లాడుతుండగా అది విరిగి పడిపోయింది. దాదాపు 5 మీటర్ల లోతు వెడల్పు ఉన్న ఈ కాలువలో పడిపోయిన ఎంపీని భద్రతా సిబ్బంది రక్షించి ముంబైలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె తీవ్రగాయాలపాలయ్యారు.