మామీదే రాస్తారా.? పత్రికలపై రసమయి ఆక్రోశం..

మానకొండూర్ ఎమ్మెల్యే , తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ పత్రికలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలపై దారుణంగా రాస్తున్నాయని.. ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు. తప్పుడు రాతలు రాసిన విలేకరిని వేరే దేశంలో ఉరితీశారని చెప్పారు.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో బీసీ బాలికల గురుకుల పాఠశాల భవనం, కేజీబీవీ ప్రారంభం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కావడం కష్టమని.. అదే చదువుకొని కలెక్టర్ నవడం ఈజీ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు సంచలనం సృష్టించాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.