మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీ రామారావు

మంత్రి ఆదేశాల మేరకు దివ్యాంగురాలు అయిన చిత్రకారిని కి పదివేల పింఛన్ సౌకర్యం సాంస్కృతిక శాఖ మంత్రి కేటీ రామారావు దివ్యాంగురాలు అయిన యువ పెయింటర్ కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈనెల ప్రథమార్థంలో రవీంద్రభారతిలో మల్కాజ్ గిరి కి చెందిన దివ్యాంగురాలు షేక్ నఫీస్ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను మంత్రి కేటీ రామారావు సందర్శించారు. మస్కులర్ డిస్ట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆమె, అద్భుతమైన తన చిత్రకళా ను కొనసాగిస్తుండడం మంత్రి అభినందించి, అన్ని విధాల ఆదుకుంటామని ఆ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ మేరకు యువ చిత్రకారినికి జీవితాంతం పెన్షన్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సాంస్కృతిక శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. పెన్షన్ తో పాటు ఆమెకి అవసరమైన పూర్తి వైద్య సహాయాన్ని నిమ్స్ ఆస్పత్రిలో కల్పిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ఆదేశాల మేరకు షేక్ నఫీస్ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం, 10 లక్షల రూపాయలను జాయింట్ అకౌంట్ లో జమ చేయడం ద్వారా నెలకు పదివేల రూపాయల పెన్షన్ వచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పెన్షన్ సౌకర్యం నఫీజ్ జీవితాంతం ఉంటుందని ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ అధికారులు మంత్రి కేటీ రామారావు కి తెలియజేయడం జరిగింది. ఈ విషయంలో సత్వరం స్పందించి న సాంస్కృతిక శాఖ అధికారులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.

ktr 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.