
హైదరాబాద్, ప్రతినిధి : సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సచివాలయంలో ప్రత్యేక పూజలు చేసి.. వాణిజ్య పన్నులు, సినీమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తలసానికి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.