
హైదరాబాద్ : ప్రజలే కథనాయకులవ్వాలని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ నగర్ లో బుధవారం సీఎం కేసీఆర్ పర్యటించారు. స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా ఆయన కాలనీ సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తానని సూచించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ నగర్ వాసులందరి గుడిసెలు పడగొట్టి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని పేర్కొన్నారు. కాలనీలో పేదలందరికీ పింఛన్లు, ఆహార భద్రత కార్డులు అందిస్తానని హామీ ఇచ్చారు.