
తెలంగాణ ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రూ.15కే 90 ఎం.ఎల్ చౌక మద్యాన్ని తీసుకురానుంది. ఆక్టోబర్ నుంచి నూతన మద్యం విధానాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 15న ఈ కొత్త మద్యం విధానాన్ని ప్రభుత్వం ప్రకటించనుంది. దీది ద్వారా తెలంగాణలో గుడుంబా మహమ్మారిని పారదోలడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది..
తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 తరువాత ప్రకటించే ఈ కొత్త పాలసీలో మండలం యూనిట్ గా లైసెన్సులు జారీ చేయనుంది.. మద్యం నిర్వహణను చూసే బెవరేజేస్ కార్పొరేషన్ ను శాఖగా మార్పు చేయనుంది. ఈసందర్భంగా శుక్రవారం అబ్కారీ విధానంపై సీఎం సమీక్షించి ఈ నిర్ణయాలు వెలువరించారు.