పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

16 నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.

మినుములు, పెసలు, మక్కలు,సోయాబీన్ అమ్మకాలపై సమీక్ష.

20 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి హరీశ్ రావు ఆదేశం.

సోమవారం నుంచి తెలంగాణ లో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్టు  మంత్రి హరీశ్ రావు తెలిపారు.. శుక్రవారం సెక్రెటేరియట్ లోని తన చాంబర్ లో మంత్రి హరీశ్ రావు మార్కెటింగ్ కార్యకలాపాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన కాటన్ కార్పొరేషన్ మేనేజింగ్  డైరెక్టర్ చొక్కలింగం తో ఫోన్ లో మాట్లాడారు. పత్తి కొనుగోలు కేంద్రాలను తెరవడం ఇప్పటికే చాలా ఆలస్యమైందని వెంటనే సి.సి.ఐ రంగంలో దిగాలని మంత్రి కోరారు. ఈ నెల 16 వ తేదీ నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలను సి.సి.ఐ ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తయినట్టు చొక్కలింగం చెప్పారు.  తక్షణం ఈ  కోనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి సి.సి.ఐ అంగీకరించినట్టు మంత్రి తెలియజేశారు. తేమ శాతం 8 కన్నా తక్కువ ఉండేటట్లు చూసుకోవాలని పత్తి రైతులను హరీశ్ రావు కోరారు.బాదేపల్లి, గజ్వేల్., ఘంపూర్, జమ్మికుంట, కరీంనగర్, పేద్దపల్లి, పరకాల, వరంగల్ తదితర ప్రాంతాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. మద్దతు ధారకన్న తక్కువ కు రైతులు అమ్ముకోవద్దని హరీశ్ రావు కోరారు. పత్తి మద్దతు ధర క్వింటాలుకు 4 3 2 0  రూపాయలకన్నా రైతులెవరూ తక్కువకు అమ్ముకొని నష్టపోవద్దని హరీశ్ రావు సూచించారు. తెలంగాణ అంతటా 231 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రాంభించాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.

ఈ మేరకు మార్క్ ఫెడ్ ఏం.డి  డాక్టర్ జగన్మోహన్ తో మాట్లాడారు. ఇప్పటివరకు 88 వేల క్వింటాల్ల మక్కలను కొనుగోలు చేశారని రైతుల అవసరాన్ని బట్టి మరికొన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మార్క్ ఫెడ్ ను మార్కెటింగ్ మంత్రి ఆదేశించారు.  1425 రూపాయల క్వింటాలు మద్దతు ధర తో  ఇప్పటివరకు  12 కోట్ల 53 లక్షలు వెచ్చించినట్టు మంత్రి చెప్పారు. మినుములు, పెసలు ,సోయాబీన్ తదితర పంటల దిగుబడులు,  వాటి మార్కెటింగ్ సమస్యలను మంత్రి సమీక్షించారు. పెసలు క్వింటాలుకు 5575 రూపాయల మద్దతు ధరతో 3 కోట్ల 37 లక్షలు వెచ్చించి 6060 క్వింటాళ్ళ పెసలు కొనుగోలు చేసినట్టు హరీశ్ రావు చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మినుముల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్క్ ఫెడ్ ను మంత్రి కోరారు. క్వింటాలు మద్దతు ధర 5400 రూపాయలతో  ఒక కోటి 96 లక్షలు వెచ్చించి మినుములు కొనుగ్లు చేసినట్టు మంత్రి హరీశ్ రావు తెలియజేషారు. అలాగే సోయాబీన్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై కూడా మార్కెటింగ్ మంత్రి సమీక్షించారు. సోయాబీన్ రైతుల కోసం 20 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరారు.  రైతులకు మద్దతు ధర తక్కువ రాకుండా అన్నీ చర్యలు తీసుకోవాలని ఆయిల్ ఫెడ్ , హాకా ,మార్క్ ఫెడ్ సంస్థలను  మంత్రి కోరారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితర అధికారులు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.