
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా రూ. 108.59కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మైండ్స్పేస్ జంక్షన్ ఫ్లైఓవర్ శుక్రవారం నాడు నగరవాసులకు అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్లు ఫ్లైఓవర్ను శుక్రవారం ఉదయం 10:30గంటలకు ప్రారంభించనున్నారు.