నగర కార్పొరెటర్లకు మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపు

గ్రేట‌ర్ హైద‌రాబాద్ కంటివెలుగు కార్య‌క్ర‌మం విజయవంతం చేద్దాం

నగరం లో ఈ నెల 15 వ తేదీ నుండి ప్రారంభ‌మ‌య్యే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయ‌డంలో ప్రతీ కార్పొరేట‌ర్‌ కృషి చేయాల‌ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. నేడు న‌గ‌రంలోని కార్పొరేట‌ర్ల‌తో టెలీకాన్ఫ్‌రెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్బంగా ఈ క్రింది విషయాలు టెలీ కాన్ఫ్‌రెన్స్‌లో మాట్లాడారు.
* జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉన్న‌ 150 వార్డులలో 1.20 కోట్ల జ‌నాభా ఉంది.
* ప్ర‌తి వార్డులో సుమారుగా 80వేల జ‌నాభా ఉంది.
* నేత్ర సంబంధిత వ్యాధుల‌పై చేసిన అద్య‌య‌నంలో 20శాతం మందికి కంటి సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని అంచ‌నా.
* జీహెచ్ఎంసీ ప‌రిధిలో 24ల‌క్ష‌ల మంది కంటి సంబంధిత స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు.
* ఈ 24ల‌క్షల మందిలో 53 శాతం (12.70ల‌క్ష‌ల‌) మందికి .25/.75 పాయింట్ ఉన్న రీడింగ్ అద్దాలు పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంది.
* వీరిలో పది శాతం (2.40ల‌క్ష‌ల‌)మంది దృష్టిలోపం ఉన్న‌వారు క్యాంపుకు హాజ‌రైన అనంత‌రం వారంరోజుల్లో కంటి అద్దాలు అంద‌జేస్తారు.
* మ‌రో 11శాతం (2.64ల‌క్ష‌ల) మందికి ఆప‌రేష‌న్ల నిర్వ‌హ‌ణ‌కు మ‌రోసారి ప‌రీక్ష‌ల‌కు రెఫ‌ర్ చేస్తారు.
* కంటి అద్దాల పంపిణీకి సంబంధించి నేత్ర ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డానికి శిక్ష‌ణ పొందిన డాక్ట‌ర్లు, ఆప్తాల్మ‌జిస్ట్ ల‌ను నియ‌మిస్తున్నాం.
* ఒకొక్క‌రు రోజుకు కేవ‌లం 35మందిని మాత్ర‌మే ప‌రీక్షించ‌గ‌లుగుతారు.
* మొత్తం 17.76 ల‌క్ష‌ల మందికి కంటి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు రోజుకు 35చొప్పున 50,000 మాన్‌డేస్ ప‌డుతాయి.
* వంద వ‌ర్కింగ్ డేలు ఉంటే 500మంది శిక్ష‌ణ పొందిన డాక్ట‌ర్లు, ఆప్తాల్మ‌జిస్ట్ లు అవ‌స‌ర‌మ‌వుతారు.
* ఒకొక్క స్క్రీనింగ్ టీమ్‌లో ముగ్గురు స‌భ్యులు ఉంటారు. వీరిలో ఒక‌రు కేస్ షీట్ రాయ‌డం, డాక్ట‌ర్లు, కంటి అద్దాలు పంపిణీ చేసేవారు ఉంటారు.
* ప్ర‌తి క్యాంప్‌లో రోజుకు 200మందికి సంబంధిత స్టాఫ్ న‌ర్స్ ప్రాథ‌మిక ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు.
మీ ప‌రిధిలోని ప్రతీ ఒక్కరిని కంటి వెలుగులో నేత్ర సంబంధిత‌ పరీక్షలు చేయించుకునేవిధంగా  కార్పొరేట‌ర్లు కృషి చేయాల‌ని మేయర్ కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.