దేశంలో ఎక్కువ అమ్ముడయ్యే స్కూటర్ ఇదేనట..

దేశంలో ప్రజల అభిరుచులు మారాయి.. ఇన్నాళ్లు బైక్ ల మీద పడ్డ జనం మోజు ఇప్పుడు స్కూటర్ ల మీదకు పోయింది..  ఇక టూవీలర్ బైక్ ల యావ పోయింది. ఇప్పుడంతా స్కూటర్ల హవానే .. ఈ స్కూటర్లు ఇంట్లో అందరికీ ఎంతో ఉపయుక్తంగా ఉండడమే దీనికి కారణం.. స్కూటీలతో మగవారితో పాటు ఇంట్లోని మహిళలకు సైతం ఉపయోగపడుతుంది.. ఇంట్లో ఎదిగిన పిల్లలకు సైతం ఈ స్కూటీలు ఉపయోగకరంగా ఉంటాయి.. గేర్లు గట్రా ఉండవు కనుక ఎక్కడైనా వాహనాన్ని సులభంగా తీసుకుపోవచ్చు..

దేశంలో ఇప్పుడు ఎంతో నాణ్యతతో మైలేజీ, ప్రమాణాలతో రిలీజ్ అయిన వాహనం  హోండా అక్టివా.. ఇప్పుడు ఈ బైక్ లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. వీటి అమ్మకాలు దేశంలో రికార్డులు సృష్టిస్తున్నాయి.. ప్రస్తుత ఆర్థిక సహాయంలో అయిదు నెలల్లో 10 లక్షల హోండా యాక్టివా స్కూళ్లు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి.. ఈ ఘనత సాధించిన తొలి వాహనం కూడా యాక్టివానే.. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న బైక్ లో 51 శాతం యాక్టివా బండ్లే.. మిగతా వాహనాలు ఏవీ కూడా 10 నుంచి 15 శాతం వరకు కూడా అమ్మకాలు లేకపోవడం విశేషం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.