
హైదరాబాద్ : తెలంగాణ అవతరణ ముగింపు ఉత్సవాలు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ , గవర్నర్ నరసింహన్ దంపతులు, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నాయకులు, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ పై లేజర్ షో అలరించింది. లక్షల మంది హాజరయ్యారు.