డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంకు పొజిషన్ సర్టిఫికెట్లను అందజేసిన మంత్రి పద్మారావు

సికింద్రాబాద్ నియోజకవర్గం: లాలాపేట్ సాయినగర్ లో 89 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంకు పొజిషన్ సర్టిఫికెట్లు మంత్రి పద్మారావు చేతుల మీదుగా పంపిణి జరిగింది.. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. లాలాపేట్ లోని రైల్వే స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించి దానికి బదులుగా చర్లపల్లి లోని రాష్ట్ర ప్రభుత్వ భూమిని కేంద్రంకు ఇవ్వడానికి సిద్ధంగా వుంది అని మంత్రి అన్నారు.. అతి త్వరలోనే మరోసారి రైల్వే
శాఖ మంత్రి కలిసి లాలాపేట్ రైల్వేభూమి అనుమతిని త్వరగా తీసుకోని పేద ప్రజలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్  ఇండ్లను అందజేస్తాం  అని మంత్రి అన్నారు.. నియోజకవర్గంలో స్థలాల కొరత ఉండటం వల్ల నిర్మాణంలో కొంత ఆలస్యం అవుతుంది అని మంత్రి అన్నారు.. అదేవిదంగా నియోజకవర్గంలో ఎక్కడ ప్రభుత్వ స్థలాలు వున్న నా దృష్టికి తీసుకరావాలని ఆర్డీవో చంద్రకళను ఆదేశించిన అని మంత్రి అన్నారు.. ప్రతి పేదకుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తా అని మంత్రి అన్నారు.. నియోజక వర్గంలో 10 వేల డబుల్ బెడ్ రూమ్
ఇండ్లని నిర్మించితీరుతామని మంత్రి ధీమా వ్యక్తం చేసారు..
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, డిప్యూటీ మేయర్ బాబా పసియుద్దీన్, కార్పొరేటర్లు ఆలకుంట సరస్వతి, హేమ, ధనంజన, హోసింగ్ అధికారులు, తెరాస సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

PADMARAO 1     PADMARAO 2

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.