
డైరీలోని ప్రతి పేజీలో సమాజ శ్రేయస్సు కోసం మంచి పనులు, విజయాలు నమోదయ్యేలా కృషి చేయాలని *రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిలి సై సౌందర్ రాజన్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) రూపొందించిన మీడియా డైరీ-2020 ని బుధవారం నాడు రాజ్ భవన్ లో తన భర్త డాక్టర్ సౌందర్ రాజన్ తో కలిసి ఆవిష్కరించారు. టీయుడబ్ల్యుజె డైరీలో నమోదైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రభుత్వ సమాచారాన్ని ఆమె పరిశీలించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షులు, ఎపి ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, టీయుడబ్ల్యుజె అధ్యక, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, పిసిఐ సభ్యులు ఎం.ఏ.మాజీద్, ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, పిసిఐ మాజీ సభ్యులు కె.అమర్ నాథ్, జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, టీయుడబ్ల్యుజె ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, ఉపాధ్యక్షులు దొంతు రమేష్, కోశాధికారి కె.మహిపాల్ రెడ్డి, దాడుల వ్యతిరేక కమిటీ రాష్ట్ర కన్వీనర్ అయిలు రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రాజేష్, యాదగిరి, హెచ్.యు.జె. అధ్యక్ష, కార్యదర్శులు రియాజ్ అహ్మద్, శిగ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.