
హైదరాబాద్ : జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ లు హైదరాబాద్ లోని అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.
అనంతరం అక్కడే ఉన్న ఉద్యమకారులు, న్యాయవాదులు, సాహితీవేత్తలను కలిసి పరామర్శించారు. ఈ సందర్బంగా దత్తాత్రేయ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గురించి మాట్లాడారు.