
హైదరాబాద్: ఈ నెల 18న తెలంగాణ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు ఏపి మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ సీఎం ను ఆహ్వానించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కేసీఆర్ ను కలవనున్నారు. రెండు తెలుగు రాష్ర్టాల సీఎంల కలయిక మరి ఏ విధమైన చర్చలు, సహాయ సహకారలు అందించుకునే ముచ్చట్లు జరుపుకుంటాయో వేచి చూడాల్సిందే!!