కురిసిన భారీ వర్షాలు, సహాయక చర్యలపైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష

 

నగరంలో కురిసిన భారీ వర్షాలు, సహాయక చర్యలపైన పురపాలక శాఖ మంత్రి కెటి రామరావు సమీక్ష నిర్వహించారు. ఈ రోజు సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో జియచ్యంసి, జలమండలి అధికారులు పాల్గోన్నారు. నిన్నటి నుండి కురుస్తున్న భారీ వ‌ర్షాల వ‌ల్ల న‌గ‌ర ప్ర‌జల‌కు ఏవిధ‌మైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ, వాటర్ వర్స్క్ లు చురుగ్గా సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఇప్పటికే నగరంలో జీహెచ్ఎంసీకి చెందిన 140 మ‌న్సూన్ ఎమ‌ర్జెన్సీ బృందాలు, 50 స్టాస్టిక్ బృందాలు నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. నీళ్లు నిలిచిన  ప్రాంతాల్లో, కాలువ‌లు, నాలాల‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌రూం ద్వారా న‌గ‌రంలోని ప‌రిస్థితులను ఎప్పటిక‌ప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం సీసీ టీవిలు, డ‌య‌ల్ 100, జీహెచ్ఎంసీ కాల్‌సెంట‌ర్, మైజీహెచ్ఎంసీ యాప్ ద్వారా వస్తున్న పిర్యాదుల మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి అధికారులకు అదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలకు పాడయిన రోడ్లను వేంటనే తిరిగి పునరుద్దరించాలని మంత్రి జియచ్ యంసి ఇంజనీరింగ్ సిబ్బందికి అదేశాలు జారీ చేశారు. రాబోయే రెండు రోజుల పాటు మరిన్ని వర్షాలు పడనున్న నేపథ్యంలో అధికారులంతా మరింత అలెర్టుగా ఉండాలన్నారు. విరిగిపడిన భారీ వృక్షాలను తొలగించి, వేంటనే విద్యుత్ సరఫరా చేయాలని ఇందుకోసం విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు.

ఈరోజు వివిధ శాఖల సమన్వయం కోసం ఈ రోజు ఉదయం జియచ్ యంసి, పోలీస్, వాటర్ వర్కస్, ట్రాఫిక్, విద్యుత్ శాఖాధికారులు సమావేశం అయ్యారు. ఈ స‌మావేశానికి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌నరెడ్డి, న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ మ‌హేంద‌ర్‌రెడ్డి, జ‌ల‌మండ‌లి ఎండి దాన‌కిషోర్‌, హైద‌రాబాద్ జిల్లా క‌లెక్టర్ యోగితారాణాతో పాటు వివిధ శాఖ‌ల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రికి జియచ్ యంసి కమీషనర్ వివరించారు. కరెంట్ షాక్ తగిలి చనిపోయిన వ్యక్తికి నాలుగు లక్షల విద్యుత్ శాఖ ద్వారా 4ల‌క్షల  ఎక్స్‌గ్రేసియా, గోడ‌కూలి మ‌ర‌ణించిన ఇద్దరికి జియచ్ యంసి తరపున రెండు ల‌క్షల చొప్పున ఎక్స్‌గ్రేసియా ప్రక‌టించినట్టు మంత్రి తెలిపారు.

జలమండలి తరపున తీసుకున్న సహాయక చర్యలను మంత్రికి జల మండలి యండి దాన కిషోర్ వివరించారు. జలమండలి తీసుకుంటున్న చర్యలు కింది విధంగా ఉన్నాయి.

  • రాబోయే 72 గంటల్లో ఏమర్జెన్సీ సెల్ ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న కాల్ సెంటర్ కు అధనంగా ఈ సెల్ పనిచేస్తుంది. ఈ సెల్ కు కాల్ చేయాల్సిన నంబర్- 9989996948
  • ప్రస్తుతం పనిచేస్తున్న అన్ని ఏయిర్ టెక్ మెషీన్లు రాబోయే 72 గంటల పాటు 24 గంటలు పనిచేస్తాయి.
  • వర్షాలు అధికంగా పడిన ప్రాంతాల్లో జలమండలి యండి, డైరెక్టర్లు స్వయంగా పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు.
  • లోతైన మ్యాన్ హోల్స్ ఉన్న చోట్ల ముందస్తు జాగ్రతగా ఏర్ర జెండాలు, గుర్తింపు బోర్డులు ఏర్పాటు చేస్తాం.
  • ముగ్గురు జియంలు, ఇద్దరు డిజియంలు, ముగ్గురు మేనేజర్లను ప్రత్యేకంగా జియచ్ యంసి కంట్రోల్ రూంలో మూడు షిప్టుల వారీగా పనిచేస్తారు.
  • నీళ్లు నిండిన ప్రాంతాల్లో క్లోరీన్ మాత్రలతోపాటు, జల మండలి తరపున నీటి పాకెట్లు సరఫరా చేస్తారు.

జియచ్ యంసి తీసుకున్న సహాయక చర్యలు

  • జియచ్ యంసిలో ప్రత్యేక ఏమర్జెన్సీ సెల్ ఏర్పాటు
  • సీసీ టీవిలు, డ‌య‌ల్ 100, జీహెచ్ఎంసీ కాల్‌సెంట‌ర్, మైజీహెచ్ఎంసీ యాప్ ద్వారా వస్తున్న పిర్యాదుల మీద ప్రత్యేకంగా దృష్టి
  • జీహెచ్ఎంసీకి చెందిన 140 మ‌న్సూన్ ఎమ‌ర్జెన్సీ బృందాలు, 50 స్టాస్టిక్ బృందాలు నిరంతరం సహాయక చర్యలు
  • కాల్ సెంటర్ 100 తో అన్ని పిర్యాదుల స్వీకరణ
  • జలమయం అయిన ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు, అహార పొట్లాల సరఫరా చేస్తున్న జియచ్ యంసి

 

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.