
చిత్తూరు, ప్రతినిధి : తిరుచానూరులో చిన్నారి లక్ష్మీప్రియ కిడ్నాప్ వ్యవహారం విషాదంగా మారింది. లక్ష్మీప్రియ దారుణ హత్యకు గురైంది. వికృతమాల గ్రామ చెరువులో చిన్నారి మృతదేహం లభ్యమైంది.
వివరాల్లోకి వెళితే.. తిరుచానూరుకు చెందిన చెంచల రెడ్డి, శ్రీనివాసులు రెడ్డిలు ఇద్దరూ సమీప బంధువులు. శ్రీనివాసులు రెడ్డి లక్ష్మీప్రియ(5) వరుసకు మేనమామ అవుతారు. లక్ష్మీప్రియ ఎల్ కేజీ చదువుతోంది. అయితే చిన్నపాటి ఆర్థిక లావాదేవీల విషయంలో ఇటీవలే చెంచల రెడ్డి, శ్రీనివాసులు రెడ్డిల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈనేపథ్యంలో తనకు రావాల్సిన డబ్బులను ఇవ్వలేదన్న కోపంతో శ్రీనివాసులు రెడ్డి చెంచల రెడ్డి కుమార్తె లక్ష్మీప్రియను బైక్ పై తీసుకెళ్లి దారుణంగా హ్యత చేసి.. వికృతమాల గ్రామ చెరువులో పూడ్చిపెట్టాడు. అయితే లక్ష్మీప్రియ మృతదేహాన్ని అధికారులు ఇంకా బయటకు తీయలేదు. ఎమ్మార్వో సమక్షంలో చిన్నారి మృతదేహాన్ని తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.