
కరీంనగర్: కరీంనగరంలో రోడ్ల విస్తరణపై కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని రోడ్డు శిథిలావస్థకు చేరాయని.. గతుకులతో ఉన్నాయని వాటన్నింటిని బాగు చేసేందుకు నిధులు వచ్చాయని కలెక్టర్ వివరించారు. వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ & కరీంనగర్ ఎం.ఎల్.ఎ. గంగుల కమలాకర్ లు సమావేశంలో పాల్గొన్నారు.