
ఏప్రిల్ 19న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర
ప్రథమ మహాసభలు హైదరాబాద్ లో నిర్వహించాలని రాష్ట్ర యూనియన్ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. సోమవారం బహీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాసభ ల తేదిని ప్రకటించారు. తెలంగాణ ఏర్పడ్డాక జరుగుతున్న తొలి యూనియన్ మహాసభలని వీటిని విజయవంతం చేయాలని నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఐజేయూ మాజీ సెక్రెటరీ జనరల్ కే.శ్రీనివాసరెడ్డి , ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు అమర్ నాథ్, యూనియన్ ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఐజేయూ కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణ, ఆలపాటి సురేష్ కుమార్, సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరుణాకర్, కోశాధికారి మహిపాల్ రెడ్డి, హెచ్ యూ జే అధ్యక్ష కార్యదర్శులు కోటిరెడ్డి, చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు అయిలు రమేశ్, కే.రాంనారాయణ, రాజేశ్, సంపత్ కుమార్, వీణావాణి, తాటికొండ భాస్కర్, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కే. ప్రబాకర్ రెడ్డి (నల్గొండ), శ్రీనివాసరావు (నల్గొండ), శ్రీనివాస్ ( మహబూబ్ నగర్) , శివకుమార్ (వరంగల్), రమణ (వరంగల్), గాండ్ల శ్రీనివాస్ ( కరీంనగర్), అంగిరేకుల సాయిలు (నిజామాబాద్), రంగాచారి(మెదక్), వెంకటేశ్వరావు , ప్రసేన్ (ఖమ్మం), వెంకటరెడ్డి (రంగారెడ్డి), ప్రకాష్ రెడ్డి (మంచిర్యాల) , మహేందర్ రెడ్డి (ఆదిలాబాద్) తదితరులు పాల్గొన్నారు.