
గుంటూరు : నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కోసం ఇప్పటికే భూ సేకరణ పూర్తయ్యింది. దాదాపు 32 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. తూళ్లూరు సమీపంలో నిర్మిస్తున్న ఈ కొత్తరాజధాని పేరును ‘అమరావతి’ గా ఖరారు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రాజధాని పేరుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.