
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎలబోతారం గ్రామంలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈటెలకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికి చిందులు వేశారు.