
- నకీలీ ఎజెంట్లపై కొరడా ఝలిపించనున్న ప్రభుత్వం
- నెలరోజుల్లో అందరు ఏజెంట్లు రిజష్టర్ చేసుకోవాలి
- లేకుంటే క్రిమినల్ కేసులు, కార్యాలయాల సీజ్
- పదే పదే వీసా మోసాలకుపాల్పడే వారీ పై పిడి యాక్ట్ ప్రయోగం
- వీదేశాల్లో ఉపాధికి టామ్ కాం సహాకారం
- మానవ అక్రమ రవాణపైన కఠిన చర్యలకు సంయుక్త సమన్వయ బృందాల ఎర్పాటు
- హైదరాబాద్లో వీదేశీ భవనానికి ఫిబ్రవరీ రెండోవారంలో శంఖుస్థానకు ఏర్పాట్లు చేయాలి
ఎన్నారై శాఖ పైన మంత్రులు కేటీ రామారావు ,నాయిని నరసింహారెడ్డిలు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో పోలీస్, హోం, ఏన్నారై శాఖల అధికారులు పాల్గోన్నారు. గత వారంలో డిల్లీలో విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి అద్యర్యంలో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను, రాష్ర్ట స్ధాయిలో అమలు చేసేందుకు ఈ సమావేశం నిర్వహించబడినది. బతుకు దెరువుకోసం వీదేశాలకు వెళ్లేవారిని మోసం చేస్తున్న నకీలీ గల్ప్ ఏజెంట్ల పైన కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నకీలీ ఎజెంట్లపైన గట్టి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను మంత్రులు అదేశించారు. E migrate లో రిజిస్టర్ చేసుకునేందుకు ఎజెంట్లకు నెలరోజుల సమయం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల రోజుల్లోగా నమోదు చేసుకోని వారందరినీ అక్రమ ఏజెంట్లుగా గుర్తిస్తామని మంత్రులు తెలిపారు. రిజిస్టర్ చేసుకోని అక్రమ ఏజెంట్ల పైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ప్రభుత్వ హెచ్చరికలు ఖాతారు చేయకుండా పదేపదే వీసాల మోసాలకు పాల్పడే నకీలీ ఎజెంట్లకు పైన పిడి పెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో పాల్గోన్న డిజిపి ఈ నకీలీ ఎజెంట్లపైన చర్యలు తీసుకుటుంటామని, ఇందుకు సంభదించి త్వరలోనే మార్గదర్మకాలు జారీ చేస్తామని తెలిపారు. అక్రమ ఎజెంట్ల పైన చర్యలు తీసుకునే విషయంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని మంత్రులు విజ్ఝప్తి చేశారు. సురక్షితంగా వెళ్లండి, సుశిక్షితులై వెళ్లండి అనే కేంద్ర ప్రభుత్వ విదేశాంగ శాఖ నినాదానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వ టామ్ కాం కంపెనీ ద్వారా చట్టపరంగా విదేశాలకు వెళ్లాలన్నారు. దీంతోపాటు రాష్ర్టంలో ఉన్న రిజిస్టర్డ్ ఎజెంట్ల ద్వారానే వెళ్లాలని మంత్రులు కోరారు.
హైదరాబాద్ లో విదేశీ భవన్ కు ఫిబ్రవరి రెండోవారంలో శంకుస్థాపన చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్న మంత్రులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు ఏన్నారై శాఖాధికారులకు అదేశాలు జారీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నారైలకు, వసల కార్మికులకోసం చేపడుతున్న చర్యలను, ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని మంత్రి కెటి రామారావు తెలిపారు. గల్ప్ దేశాలకు జరుగుతున్న మహిళల అక్రమరవాణా, మోసపూరిత వివాహాలపైన మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ విషయంలో రాష్ర్ట పోలీసు శాఖ గతకొంత కాలంగా తీసుకుంటున్న చర్యలను మంత్రి అభినందించారు. ఇలాంటి మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో మైనార్టీ సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, ఎన్నారై శాఖ, పోలీస్ శాఖలు ఉమ్మడి సంయుక్త సమన్వయ బృందాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇక్కడ పోలీసుల చర్యలతో ముంబాయి, కలకత్తా వంటి ప్రాంతాల నుంచి ఈ ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్న నేపధ్యంలో అయా రాష్ట్రాల అధికారుల సహాకారం తీసుకోవాలని సూచించారు. ఈ మానవ అక్రమ రవాణకు పాల్పడుతున్న ఏజెంట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఈ మేరకు పాస్ పోర్టు కార్యాలయ అధికారుల సహాకారం తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో డిజిపి మహేందర్ రెడ్డి, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, ఏన్నారై, పోలీసు శాఖాధికారులు పాల్గోన్నారు.