
సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో సతీసమేతంగా పాల్గొన్నారు. బోనాలు సమర్పించి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు కేసీఆర్ కు పట్టువస్త్రాలు, శేషవస్త్రాలు కప్పి అమ్మ వారి కుంకుమ, బొట్టు అందించారు.